కేజీబీవీ విద్యార్థినికి మెడికల్ లో సీటు

కేజీబీవీ నిర్మల్ అర్బన్ లో చదివిన రాథోడ్ శిల్ప అనే విద్యార్థినికి TRR  సంగారెడ్డి మెడికల్ కాలేజీలో MBBS సీటు లభించింది .  కుమారి శిల్పను కలెక్టర్ భవనంలో కలెక్టర్  ముషారఫ్ అలీ ఫారుకి   శాలువాతో సత్కరించి  పుష్పగుచ్చంతో అభినందించారు. విద్యార్థిని మెడికల్ సీటు సాధించడం పట్ల డిఇఓ రవీందర్ రెడ్డి ,  సెక్టోరల్ అధికారిని శ్రీదేవి   ఆ పాఠశాల  స్పెషల్ ఆఫీసర్  సుజాత , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్  పలువురు అభినందించారు