గంగుల ను కలిసిన భూ నిర్వాసితులు

 

★సానుకూలంగా స్పందించిన మంత్రి

★ సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్ కు ఆదేశం

కరీంనగర్   ( జనం సాక్షి ) :
కరీంనగర్‌ నుంచి వరంగల్‌ నేషనల్‌ హైవే 563 భూ సేకరణలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు,వ్యవసాయ భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ చెంజర్ల ఎన్‌హెచ్‌–563 భూ నిర్వాసితులు శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం సమర్పించారు.
శుక్రవారం చెంజర్ల ,ఖాదర్ గూడెం భునిర్వాసితులు ఆయన నివాసంలో కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.సానుకూలంగా స్పందించిన మంత్రి అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కర్ణన్ తో ఫోన్ లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానకొండూర్‌ మండలంలోని చెంజర్ల రెవెన్యూ గ్రామ పరిధిలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, బావులు, వ్యాపారాలు కోల్పోతున్న వారి భూములకు గుంట ఒక్కంటికి ధర రూ. 63 వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నారని తహశీల్దార్‌ కార్యాలయమునకు జాబితా ప్రకటించారని అన్నారు. చెంజర్ల గ్రామం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 14 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండి, శాతవాహన అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటి ( సుడా) పరిధిలో ఉండి మెట్ట ప్రాంతమైనందున పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నారు. బహిరంగ మార్కెట్ లో కోల్పోతున్న భూముల ధరలు ఇండ్ల స్థలాలు గుంటకు 8 లక్షల నుంచి10 లక్షల వరకు ఉంది , వ్యవసాయ భూములు గుంటకు ధర రూ 4లక్షల నుండి 6 లక్షల వరకు ఉంది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఇప్పించాలని కోరారు.ఇండ్లు కోల్పోతున్న వారికి ఇంటి నిర్మాణమునకు అయ్యే ఖర్చులు పెరిగినందున, సరియైన నష్టపరిహారం ఇప్పించాలని తెలిపారు. భూ సేకరణ సర్వే లో భూమి, ఇండ్లు, బావులు, బోరులు చాల వరకు నమోదు చేయబడలేదని, కొంతమందికి నష్టపరిహార జాబితాలో చాల తక్కువగా నమోదు వచ్చిందన్నారు.భూ నిర్వాసితులు మధ్య నష్టపరిహారంలో చాల వ్యత్యాసాల వలన లబ్ధిదారులు నష్టపోతున్నారని,రీ సర్వే జరిపించి మాకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో చెంజర్ల ఎన్‌హెచ్‌–563 భూ నిర్వాసితులు బి.రత్నాకర్, జి.రామక్రిష్ణ, తో పాటు సర్పంచ్ బొల్లా వేణుగోపాల్ ,ఎంపీటీసీ గడ్డి గణేష్ ,లవయ్య ,గౌస్ ,వీర స్వామి ,శ్రీనివాస్ రెడ్డి ,సత్తయ్య ,హరిశంకర్ ,సంపత్ ,రాధిక ,సరోజన ,తిరుపతి ,బాపురెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.