‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ పాల్గొన్న అమీర్‌ఖాన్‌


` బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మొక్కనునాటిన బాలీవుడ్‌ నటుడు
` ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కు ప్రశంసలు
హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):కోట్ల హృదయాలను కదిలించిన ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది.ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామ హులను కదిలించిన ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ ఇవ్వాల బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, విలక్షణ చిత్రాల హీరో అవిూర్‌ ఖాన్‌ ను చేరింది. ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్న మిస్టర్‌ పర్‌ ఫెక్ట్‌ అవిూర్‌ ఖాన్‌, తన లాల్‌ సింగ్‌ చద్ధా సహానటుడు, టాలీవుడ్‌ యంగ్‌ టర్క్‌ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యుడ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ లో ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ లో భాగంగా మొక్కలు నాటారు.అనంతరం అవిూర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్‌ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం అప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్‌ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో రామ్మోహన్‌ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.