చిన్నారుల అక్షరాభ్యాసం చేయించిన సర్పంచ్*

పెబ్బేరు మండలం పరిధిలో కొత్త సూగూరు గ్రామంలో అంగన్ వాడి కేంద్రంలో గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ ఆధ్వర్యంలో  విహెచ్ఎన్డి కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం ప్రతి ఒక్కరు అంగన్ వాడి కేంద్రంలో వచ్చి తినాలని అన్నారు. గ్రామంలో ఎవరికైనా పౌష్టికాహారం అందని ఎడల మా దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. చిన్నపిల్లలు అంగవైకల్యానికి నిరోధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి పౌష్టికాహారం సరఫరా చేస్తుందని అన్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యాదగిరి,ఏ ఎన్ ఎమ్  అనురాధ, అంగన్వాడి టీచర్ స్వరూప రాణి, మంజుల, ఆశ వర్కర్లు నాగమణి, భారతి, తల్లులు విజయలక్ష్మి, మనీషా, జయమ్మ తదితరులు పాల్గొన్నారు