చేర్యాల వాసులకు మొదటి,ద్వితీయ బహుమతులు

అభినందించిన వికలాంగుల సంఘం
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : సిద్దిపేట జిల్లాస్థాయి వికలాంగుల క్రీడోత్సవాలు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ క్రీడల్లో మొదటి బహుమతి చేర్యాల మండలానికి చెందిన తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్, ద్వితీయ బహుమతి దొడ్డి మల్లేశం బహుమతులు పొందారు. వారిని చేర్యాల మండల ప్రజలు, వికలాంగులు అభినందించారు.