జంబ్గి కె గ్రామంలో అభివృద్ధి పనులు

 జనం సాక్షి సెప్టెంబర్ 26 రాయికోడ్ మండల పరిధిలోని జంబ్గి (కె) గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నయి. గ్రామాలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన నిధులతో రూ.10 లక్షలతో 250 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణాన్ని హనుమాన్ మందిరం నుండి ఎస్సి కాలనీ వరకు సర్పంచ్ పార్వతి- శ్రీకాంత్ భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఎంతో కృషి చేసి ముఖ్యమంత్రి నిధుల నుండి గ్రామానికి ఎస్‌డీఎఫ్ నిధులను మంజూరు చేయించడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి అమూల్య, ఉప సర్పంచ్ బిమయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు రత్నరెడ్డి, తిరుమల శ్రీనివాస్, వగ్గు రమేష్, వగ్గు శ్రీనివాస్. నర్సింలు.  తదితరులు పాల్గొన్నారు.