జోగులాంబను దర్శించుకున్న మేయర్‌


జోగులాంబ గద్వాల,అగస్టు12(జనం సాక్షి): అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్‌ రవి ప్రకాష్‌ గౌడ్‌, ఆలయ ఈవో ప్రేమ్‌ కుమార్‌ రావు అర్చకుల తో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మేయర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.