*జోగులాంబ సన్నిధిలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ చెన్నారెడ్డి

అలంపూర్ ఆగస్టు 5జనంసాక్షి శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గురువారం ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ చెన్నారెడ్డి  దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ పురంధర్, ముఖ్య అర్చకులు డి. ఆనంద్ శర్మ,మరియు ఆలయ చైర్మన్ బి.శ్రీనివాస రెడ్డి,  ధర్మకర్త హరిబాబు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.