డిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.

 

 

 

 

 

 

 

ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ఘనంగా ప్రారంభించారు.పార్టీ కార్యాలయ ఆవరణలో మొదట బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం కీలక పత్రాలపై సంతకం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ ఆఫీస్‌ ప్రారంభోత్సంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారినటువంటి పార్టీ దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఅర్ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం ఢిల్లీకి చేరుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,జడ్పీ చైర్మన్ పుట్ట మధు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్,బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.