తహసిల్దార్‌ సంతకం ఫోర్జరీతో భూమి రిజిస్టేష్రన్‌

వికారాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీకి తెగబడ్డారు. తహసీల్దార్‌లు అప్పులునాయుడు, రవీందర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్టేష్రన్‌ చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసులకు తహసీల్దార్‌ రవీందర్‌ ఫిర్యాదు చేశారు. ఖలీల్‌ పేరుతో కంప్యూటర్‌ ఆపరేటర్లు, మరో ఇద్దరు కలిసి ఫేక్‌ పట్టా క్రియేట్‌ చేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదుతో ముజ్జు, పరుశురాం, రాజు, ఖలీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటకు రాకుండా రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది జాగ్రత్త పడ్డారు.