తాతా నిఖిల్ కు నివాళులు అర్పించిన టేకులపల్లి బిఆర్ఎస్ నాయకులు

 

టేకులపల్లి జనవరి 24 జనం సాక్షి)బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అద్యక్షుడు & ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడు తాతా విశ్వేశ్వరరావు, నాగమణి దంపతుల కుమారుడు తాతా నిఖిల్ మృతి చెందారు. తిరుమలయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని వారి నివాసమునకు వెళ్లి వారి కుటుంబాన్ని ఇల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం నిఖిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
టేకులపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బోడబాలు నాయక్, యూత్ మండల్ ప్రెసిడెంట్ బర్మవత్ శివకృష్ణ, బేతంపూడి సొసైటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ చౌదరి, సర్పంచ్ మాలోత్ పూలిసింగ్ నాయక్, పి ఆర్ కాలే కాలే ప్రసాద్, గోరంట్ల రవికుమార్.