తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు సైదులు మరణం బాధాకరం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి*
*గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ ( 2):* గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్వీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు సైదులు మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. సైదులు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలి భగవంతుని ప్రార్ధించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సైదులును గత ఆరునెలలుగా మంత్రి  తన ఇంటిలో ఉంచుకుని వైద్యం చేయిస్తూ, ప్రతి నెలా రూ.10 వేలు మందులకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ సైదులు అకాలమరణం చెందడం పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు…