తొలిరోజు పైచేయి సాధించిన పాక్‌

వికెట్‌ నష్టానికి 235 పరుగులు
ఇస్లామబాద్‌,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): ఆస్టేల్రియాతో తొలిరోజు జరిగిన తొలి టెస్టు మొదటి రోజున పాకిస్తాన్‌ పట్టుబిగించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్‌ కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (127 బ్యాటింగ్‌) సెంచరీతో కదం తొక్కగా మరో ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (44)ఫర్వాలేదనిపించాడు ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌ కు 105 పరుగులు జోడిరచారు. అబ్దుల్లా నిష్కమ్రణతో వచ్చిన అజర్‌ అలీ (59 బ్యాటింగ్‌) కలిసి ఇమామ్‌ ఇన్నింగ్సును నడిపిస్తున్నాడు.