దళితబంధు అమలుపై ఉద్యోగుల హర్షం

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. దళితుల కష్టాలు తెలిసిన నిజమైన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని ఉద్యోగులు తెలిపారు. దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళిత జీవితాలు సంపూర్ణంగా మారుతాయన్నారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.