దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్తో కేటీఆర్ భేటీ..!
హైదరాబాద్ జనంసాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భేటీ కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్ జగన్తో గొప్ప సమావేశం జరిగింది’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, నేతలిద్దరు ఏయే అంశాలపై చర్చించారన్న విషయం తెలియరాలేదు.ఇదిలా ఉంటే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.