దిగ్విజయ్ సింగ్ తో సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరం చంద్ భేటీ

మెట్పల్లి టౌన్,డిసెంబర్ 23,
జనంసాక్షి :
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో సుప్రీంకోర్టు అడ్వకేట్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్ కొమిరెడ్డి కరంచంద్ నేడు హోటల్ తాజ్ కృష్ణ లో భేటీ అయ్యారు. ఆయన నేడు మెట్పల్లిలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ తో భేటీ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం లోని పార్టీ పరిస్థితులు సంస్థ గత బలోపేతంపై చర్చించామని, అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇటు తెలంగాణలోని హైకోర్టులో గాని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో గాని న్యాయపరమైన పోరాటాలు చేసేందుకు వీలుగా పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని బస్ డిపో ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునః ప్రతిష్టించడం పట్ల దిగ్విజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారని తెలిపారు