దీపావళి టపాసుల షాపుల్లో భారీ అగ్నిప్రమాదం

ఖమ్మంలో బుగ్గిపాలయిన టపాసులు
ఖమ్మం,అక్టోబర్‌28(జనం సాక్షి ):  ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంలో వ్యాపారులు బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా స్టేడియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్టేడియంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన దుకాణదారులు, ప్రజలు ఘటనాస్థలి నుంచి బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగిందని అధికారులు తెలిపారు.