*దుర్గ భవాని మాత మాలధారణ దీక్షలు ప్రారంభం*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 26:
జనం సాక్షి
మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయంలో దుర్గా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భవాని అమ్మవారి మాల ధారణ దీక్షలు పురోహితులు విధిమౌళి శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది త్రిశక్తి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కలిసి 150 మంది, భవాని మాత మాల ధారణ దీక్షలు స్వీకరించారు . అనంతరం అమ్మవారిని పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం త్రిశక్తి ఆలయంలో దుర్గా నవరాత్రుల ఉత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యేక పూజల తో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవదుర్గ కమిటీ అధ్యక్షులు, దావన పెళ్లి రాజారాం, ఉడుత శ్రీనివాస్, బేతు భాస్కర్ ద్యావనపల్లి గణేష్, గుజ్జేటి శ్రీనివాస్, పలువురు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు