దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌

ఎక్కడిక్కడే రోడ్ల దిగ్బంధనం
బంద్‌తో స్తంభించిన రవాణా వ్యవస్థ
ఉత్తరాదిలో పలుచోట్ల ఆందోళనలు ఉధృతం
ఢల్లీి సరిహద్దుల నుంచి రాజదానికి ట్రాఫిక్‌ జామ్‌
రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన రైతు సంఘాల నేతలు
న్యూఢల్లీి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంస్థలు ఇచ్చిన ’భారత్‌ బంద్‌’ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్‌తో రైతులు ఎక్కడిక్కడే రహదారుల దిగ్భందనం చేపట్టారు. పంజాబ్‌, హర్యానాల్లో జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలు, లింక్‌ రోడ్లు, రైల్వే ట్రాక్‌లను రైతులు దిగ్బంధం చేశారు. రోడ్లు, రైల్‌ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రాష్టాల్ర ప్రభుత్వాలు మద్దతు ప్రకటించడంతో రవాణా బస్సులను నిలిపివేశారు. షాపులు మూసి వ్యాపారులు మద్దతు ప్రకటించారు. పంజాబ్‌లో రైతులు 350కి పైగా ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢల్లీి పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్‌`ఢల్లీి సరిహద్దులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌కు అనుబం ధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్‌ బంద్‌లో పాల్గొన్నాయి. ఢల్లీి` అమృత్‌సర్‌ జాతీయ రహదారిపై రైతులు నిరసనకు దిగారు. కేరళలో భారత్‌ బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. భారత్‌ బంద్‌లో భాగంగా పంజాబ్‌`హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు రైతులు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజిపూర్‌ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగు తోంది. రైతుల నిరసనలతో ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఘజిపూర్‌ వైపు వెళ్లే వాహనాలు నిలిచి పోయాయి. ప్రదర్శనా స్థలాల్లో శాంతి భద్రతల పరిస్థితిని కాపాడాలని పోలీసు బలగాలకు పంజాబ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆదేశాలిచ్చారు. ధర్నా ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఉంచారు. హర్యానాలోనూ హైవేలు దిగ్బంధం చేశారు. ఒక్క జింద్‌ జిల్లాలోనే 25 ప్రాంతాలను దిగ్బంధం చేశారు. పశ్చిమబెంగాల్‌లోనూ వామపక్షాలు బంద్‌కు దిగడంతో రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. బంద్‌ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూసి ఉంచాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు, సహాయ, పునారావాస కార్యక్రమాలు, వ్యక్తిగత ఎమర్జెన్సీ పనులకు హాజరయ్యే వారికి బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. స్వచ్ఛందంగా, శాంతియుతంగా బంద్‌ పాటించాలని కోరింది. కాగా, బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంద్‌కు మద్దతు ప్రకటించారు. బీహార్‌ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ భారత్‌ బంద్‌లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు కూడా బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటు న్నామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. దేశంలో భారత్‌ బంద్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. ఢల్లీి నుండి గల్లీ వరకు కార్మికులు, కర్షకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంద్‌కు ప్రభుత్వాలు మద్దతునివ్వడంతో ప్రజలు స్వచ్చంధంగా ఆందోళనల్లో
పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. కాగా, అంబులెన్స్‌, డాక్టర్లు, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కల్గించకుండా.. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేష్‌ తికాయత్‌ తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్రలోని షాహాబాద్‌ వద్ద ఢల్లీి`అమృత్‌సర్‌ జాతీయ రహదారిపై అన్నదాతలు దిగ్బంధించారు. పంజాబ్‌`హర్యానా సరిహద్దును కూడా సాయంత్రం 4 గంటల వరకు దిగ్బంధిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా భారత్‌ బంద్‌ శాంతియుతంగా జరుగుతోంది. ఆందోళనల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకు వచ్చిన కర్షక, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపడుతున్న ఆందోళన లకు కేరళ ప్రభుత్వం మద్దతునిచ్చింది.ªూష్ట్రంలోని విపక్ష కాంగ్రెస్‌ సైతం మద్దతు తెలపడంతో శాంతియుతంగా, స్వచ్ఛందంగా బంద్‌ జరుగుతోంది. దీంతో అక్కడి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రైతు సంఘాల పిలుపు మేరకు బీహార్‌లో ప్రతిపక్ష రాష్టీయ్ర జనతాదళ్‌ బంద్‌లో పాల్గొంది. హాజీపూర్‌లో ఆర్జేడీ నేత ముఖేష్‌ రోషన్‌, ఇతర కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో హాజీపూర్‌`ముజఫర్‌పూర్‌ రహదారిపైన ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హర్యానాలో రైతులు పలు రోడ్లను దిగ్బంధించారు. బహుదూర్‌గడ్‌ రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకున్న రైతులు రైల్వేట్రాక్‌లపై నినాదాలు చేశారు. బహుదూర్‌గఢ్‌ బార్‌ అసోసియేషన్‌ కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది. అక్కడ న్యాయవాదులు నేడు విధులకు గైర్హాజరయ్యారు. పంజాబ్‌లో భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసలు జరుగుతున్నాయి. అమృత్‌సర్‌లోని దేవీదాస్‌పురలాలో రైతులు రైల్వే ట్రాక్‌లపై ఆందోళనలు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పంజాబ్‌లో పలు రోడ్లపై అన్నదాతలు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో భారత్‌బంద్‌కు ప్రజానీకం సంఫీుభావం తెలిపింది. దీంతో పలుచోట్ల నిరసలు చోటుచేసుకున్నాయి. కోల్‌ కత్తాలో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఎపిలో గులాబ్‌ తుపాన్‌ ధాటికి వర్షాలు కురుస్తున్నా…. వామపక్ష, ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగించాయి.