నిండు గర్భిణీ కి రక్తం ఇచ్చి కాపాడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ఎల్లారెడ్డి  25 జూన్  (జనంసాక్షి ) ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న సందర్భం లో నిండు గర్భిణి ని కాపాడిన   సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే  కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం  ఒక నిండు గర్భిణి కి చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం కావలసి రావడంతో రోగి బంధువులు కామారెడ్డి బ్లడ్ బ్యాంక్ వాల్లను సంప్రదించగా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన వెంకటరమణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సకాలంలో ఆ గర్బిణి మహిళకు స్వచ్చందంగా రక్తదానం చేసి ఆ రోగి ప్రాణాన్ని కాపాడినందుకు ఆమె బంధువులు,ఆసుపత్రి వైద్యులు అభినందించారు.