నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పరి శ్రీనివాసులు ని పరామర్శించిన ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) 21 కోడేరు మండలం మాచుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాసులు  పక్షవాతంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలిసుకున్న  ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, స్వయంగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఉప్పరి శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారికి దైర్యం చెప్పారు,మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ పూర్ణచందర్ రెడ్డి, బాధితుని కుటుంబసభ్యులు  తదితరులు ఉన్నారు.