నిరాశాజనకంగా బడ్జెట్‌

` ఎన్నికల వేళ కర్నాటకకు పెద్దపీట
` అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల కేటాయింపు
` ఆదాయ పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు
` ఆదాయం రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను
` ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను
భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు
వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు
పెరగనున్న బ్రాండెడ్‌ దుస్తుల ధరలు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు
భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు
టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గింపు
లిథియం బ్యాటీరీలపై 21 నుంచి 13శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు
సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్‌ లిమిట్‌ రూ.15 నుంచి 30లక్షలకు పెంపు
63వేల సొసైటీల డిజిటలైజేషన్‌ కోసం రూ.2,516 కోట్లు కేటాయింపు
ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం
నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్‌ పథకం
స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి యూనిట్‌ మాల్స్‌
నీతి ఆయోగ్‌ మరో మూడేళ్లపాటు పొడిగింపు
దేశంలో 50 టూరిస్ట్‌ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఫార్మారంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
నేషనల్‌ హైడ్రోజన్‌ గ్రీన్‌ మిషన్‌కు రూ.19,700 కోట్లు కేటాయింపు
విద్యుత్‌ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు
దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం
5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు
నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ ద్వారా సులభతర కేవైసీ
ఈ`కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు
గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు:
ఏడాదికి అర్బన్‌ ఇన్‌ ఫ్రా ఫండ్‌ కోసం రూ.10వేల కోట్లు
రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు
రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు
బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు
పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు
గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు
న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రధాని మోడీ చెప్పినట్లుగా ప్రపంచం యావత్తూ భారత్‌ బడ్జెట్‌ వైపు చూస్తుందన్న సూచనలు ఏవీ లేకుండా..ఎటువంటి మెరుపులు..ఊరడిరపులు.. కానరాని బడ్జెట్‌ ఆవిష్కృతం అయ్యింది. వరాలు కానీ, మాయలు కానీ లేకుండా సాదాసీదాగానే బడ్జెట్‌ కేటాయింపులు చేపట్టారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగగా ఎలాంటి తాయిలాలు ప్రకటించే ప్రయత్నం చేయలేదు.ఆర్థిక సంవత్సరం 2023`24కు సంబంధించిన వార్షిక బ్జడెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌గా పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ అని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఆదాయపు పన్నుల్లో శ్లాబుల వంటి ఉత్సాహం కొతం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి. మొత్తంగా సాదాసీదాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఐదోసారి తన 2023`2024 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పలురాష్టాల్ర ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఉత్సాహకరంగా ఉంటుందన్న భావన లేకుండా ముందుకు సాగారు. ఆమె బడ్జెట్‌ ప్రసంగం గంటన్నర సేపు సాగింది. ఇకపోతే ఏడు ప్రాధాన్యతా అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన సాగిందని చెప్పారు. సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌలిక సదుపాయలు`పెట్టుబడులు,సామర్థ్యాల వెలికితీత, స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువశక్తి, విత్త విధానం ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ఎన్నో అంచనాల నడుమ వార్షిక బడ్జెట్‌ను ఆవిష్కరించారు. తరుము కొస్తున్న ఆర్థిక మాంద్యం.. వచ్చే ఏడాదిలో ఎన్నికలు.. ఈ నేపథ్యంలో తాయిలాల ప్రకటనా? ఆర్థిక క్రమశిక్షణా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నో సవాళ్ల నడుమ బడ్జెట్‌ను ఆవిష్కరించారు నిర్మలా సీతారామన్‌. ఈ ఏడాది సమయంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చులు, ఆదాయాలను తెలియజేసేదే ఈ బ్జడెట్‌. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌ అని చెప్పారు నిర్మలా సీతాª`రామన్‌. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. వృద్ధి రేటు ఈ ఏడాది 7 శాతంగా వస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసినట్లు చెప్పారు. గత9 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపైందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమమే లక్ష్యంగా బ్జడెట్‌ను తీసుకొచ్చినట్లు నిర్మలమ్మ వివరించారు. తొమ్మిదేళ్లలో దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించిందని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలతో పాటు 157 నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుకు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం చేపట్టనున్నారు. మహిళా సాధికారత దిశగా భారత్‌ కృషి చేస్తోందిని అన్నారు. వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. గ్రీన్‌ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్‌ నిర్మించాం. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాంమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించామన్నారు. ప్రస్తుత ఏడాదికి వృద్ధి రేటు 7శాతంగా అంచనా వేశారు. 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.102 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాం. ఆత్మనిర్భర్‌ భారత్‌తో చేనేత వర్గానికి లబ్ది చేకూరిందని వివరించారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్‌ పునాదిగా అభివర్ణించారు. పారదర్శకమైన సవిూకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాందిగా పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను.. కళ్లకు కట్టేలా వివరిస్తూ పద్దును సమర్పించారు నిర్మలా సీతారామన్‌.. దేశ వృద్ధి రేటు శరవేగంగా పెరుగుతోందని, భారత్‌
ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. ఉపాధి అవకాశాలను పెంపొందిం చడమే ఈ బడ్జెట్‌ టార్గెట్‌ అని పేర్కొన్నారు. మురుగునీటి వ్యవస్థపై పెద్ద ప్రకటన చేశారు. ’మ్యాన్‌ హోల్‌ టు మెషీన్‌ మోడ్‌ ’ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు యంత్రాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. పలు వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్టిక్ర్‌ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి. వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చింది..
రాష్టాల్రకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు ఇస్తున్నామని తెలిపారు.  2013`14తో పోలిస్తే రైల్వేలకు 9 రేట్ల నిధులు కేటాయించామన్నారు. ’పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు. పీఎం ఆవాస్‌ యోజనకు రూ.79 వేల కోట్లు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు. మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి మోడీ సర్కారు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎం ఆవాస్‌ యోజన పథకానికి బ్జడెట్‌ లో నిధులు భారీగా పెంచింది. గతేడాది ఈ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 66శాతం పెంచింది. ప్రస్తుత బ్జడెట్‌ లో రూ.79వేల కోట్లు కేటాయించింది. వడ్డీ రేట్ల పెరుగుదలతో సందిగ్దంలో పడ్డ గృహ కొనుగోలుదారులకు కేంద్రం ప్రకటన ఊరటనిచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో పీఎం ఆవాస్‌ యోజన కింద మరింత మందికి లబ్ది చేకూరనుంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలకు రుణాలపై సబ్సిడీ ఇస్తుంది. మూడు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.  పీఎం ఆవాస్‌ యోజనలో భాగంగా ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2.50 లక్షల సాయం అందిస్తుంది. మొదటి విడతలో రూ. 50 వేలు, రెండో విడతలో రూ. 1.50 లక్షలు, మూడో విడతగా కొ.50 వేలు ఇస్తారు. మొత్తం రూ. 2.50 లక్షల సబ్సిడీలో ఒక లక్ష సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మిగిలిన 1.50 లక్షలు మంజూరు చేస్తుంది. బడ్జెట్‌లో కేంద్రం రైల్వేలకు రికార్డు స్థాయి కేటాయింపులు చేసింది. రైల్వేల అభివృద్ధికి రూ.2.4లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. 2013 `14తో పోలిస్తే రైల్వేలకు కేటాయించిన నిధులు 9 రెట్లు ఎక్కువ.  కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం ఎక్కువగా నిధులతో పాటు మూలధనం కింద రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడిరచారు. భౌగోళిక, భాషాపరమైన, కళలపరంగా, అన్ని స్థాయుల్లో పుస్తకాలను ఇది అందుబాటులోకి ఉంచుతుంది. ’యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయుల్లో ఫిజికల్‌ లైబ్రరీలు ఏర్పాటుకు రాష్టాల్రకు ప్రోత్సాహం అందిస్తాం. నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ సదుపాయాన్ని పొందేందుకు కావాల్సిన మౌలిక వసతులకు తోడ్పాటు అందిస్తాం’ అని వెల్లడిరచారు. రానున్న మూడు సంవత్సరాలకు 740 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు
చెప్పారు. అందుకోసం 38,800 మంది టీచర్లు, సహాయక సిబ్బందిని తీసుకుంటామన్నారు. ఈ పాఠశాలల కింద 3.5 లక్షల గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.గ్లోబల్‌ హబ్‌ ఫోర్‌ మిల్లెట్స్‌ కింద మిª`లలెట్స్‌లో భారతదేశం చాలా ముందుంది. రైతులకు పౌష్టికాహారం, ఆహార భద్రత, ప్రణాళిక కోసం మిª`లలెట్స్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీఅన్నా రాడి, శ్రీఅన్నా బజ్రా, శ్రీఅన్నా రందానా, కుంగ్ని, కుట్టు అన్ని ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మినుముల్లో రైతుల సహకారం ఎంతో ఉందని, శ్రీ అన్నను హబ్‌గా మార్చేందుకు కఅషి చేస్తున్నామన్నారు. శ్రీఅన్న నిర్మాణానికి హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి చాలా సాయం అందుతోంది. 2023`24 సంవత్సరానికి రూ. 20 లక్షల కోట్ల రుణ లక్ష్యం నిర్దేశిరచబడిరది. వ్యవసాయ రంగానికి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. త్వరలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భారతదేశం ఏ 100 ద్వారా దేశం ప్రపంచవ్యాప్తంగా బలోపేతం అవుతుంది. గ్రావిూణ మహిళల కోసం 81 లక్షల స్వయం సహాయక సంఘాలకు సహాయం లభించింది. ఇక ముందు ఇది మరింత పెరుగుతుంది. క్రాప్ట్‌, ట్రేడ్‌లో పనిచేస్తున్నవారికి, కళ, హస్తకళలకు సహకరించేందుకు పీఎం విశ్వ కర్మ కౌశల్‌ సమ్మాన్‌ తీసుకొస్తున్నాం. స్వావలంబన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడంపై దఅష్టి సారించి వారికి సామాజిక భద్రత కల్పించారు. మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహిస్తాం. శతాబ్దాల తరబడి తమ స్వహస్తాలతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారిని విశ్వకర్మ అనే పేరుతో సంబోధిస్తున్నారు. తొలిసారిగా వారికి సహాయ ప్యాకేజీని నిర్ణయించారు. వాటిని వీ?వీజు చైన్‌తో అనుసంధానించే పని జరుగుతుంది.
గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనలో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 2014 నుంచి నిరంతరంగా చేస్తున్న కృషి వల్ల ప్రపంచంలోనే 10 నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. పీఎం సురక్ష, పీఎం జీవన్‌ జ్యోతి యోజన ద్వారా కోట్లాది మందికి లబ్థి చేకూరుతుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
ప్రభుత్వం 220 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌లను అందించాం. 44.6 కోట్ల మంది ప్రజలు పీఎం సురక్ష, పీఎం జీవన్‌ జ్యోతి యోజన ద్వారా పొందారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వం సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ ద్వారా ముందుకు సాగింది. 28 నెలల్లో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చాం అంటే చిన్న విషయం కాదన్నారు నిర్మలా సీతారామన్‌. గత కొన్నేళ్లలో భారత ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయిందని ఆర్థిక మంత్రి తెలిపారు. తలసరి ఆదాయం ఏటా రూ.1.97 లక్షలకు చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే మరింత వ్యవస్థీకృతమైంది. దీని ప్రభావం ప్రజల జీవన స్థితిగతులపై కనిపిస్తోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు దాదాపు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ . ఉపాధి అవకాశాలను పెంపొందించాలనేది ప్రభుత్వ ప్రత్యేక దృష్టి  భారతదేశం నుండి   జి 20 అధ్యక్ష పదవి ఒక పెద్ద అవకాశం. ఇది భారతదేశ బలాన్ని చూపుతుందన్నారు . బడ్జెట్‌ కేటాయింపులు చెబుతున్నప్పుడు ప్రధాని సహా మంత్రులు, ఎంపిలు బల్లలు చరిచారు.
ఎన్నికల వేళ కర్నాటకకు పెద్దపీట
అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల కేటాయింపు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సాదాసీదాగా ఉందని వస్తున్న విమర్శల నేపథ్యంలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు మాత్రం పెద్దపీట వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకపై కరుణ చూపారు. నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ సాయం ప్రకటించారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు ఈ కేంద్ర సాయం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. కరువుతో కొట్టుమిట్టాడుతున్న మధ్య కర్ణాటక ప్రాంతాలను ఆదుకునేందుకు అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తుంగ భద్ర నదిపై గల భద్ర రిజర్వాయర్‌ నుంచి ప్రాజెక్టు లిప్ట్‌ ఇరిగేషన్‌ కింద 17.40 టీఎంసీల నీటిని తరలించేందుకు అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది కర్ణాటక సర్కార్‌. ఏప్రిల్‌`మే మధ్య కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం బస్వరాజ్‌ బొమ్మై సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సారధ్యంలోని సెక్యులర్‌ జనతాదళ్‌ (జేడీఎస్‌) నుంచి అధికార బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. తమ సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర సాయం ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై ధన్యవాదాలు తెలిపారు.