నిరుపేదలకు ఆసరా

కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
దోమ నవంబర్ 24(జనం సాక్షి)
 దోమ మండల పరిధిలోని గొడుగొనిపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన మీర్ పేట  సక్కుబాయి గత కొంత కాలంగా పెరలసిస్ (పక్షవాతం)  కారణంగా బాధ పడుతున్నారు ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న సేవా కార్యక్రమాలు లక్ష్యంగా పనిచేస్తూ మనవాత దృక్పథం తో స్పందించి కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి మీర్ పెట్ సక్కు బాయి ను ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని వైద్య ఖర్చుల తక్షణ ఖర్చుల కొరకై *10,000/- పదివేల* ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృతమ్మ ఆంజనేయులు, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, జి దశరథ్ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ భీమయ్య, జే నిరంజన్,ఎర్ర నర్సింహులు, బి రాములు జే యాదయ్య, చాపల గూడెం సర్పంచ్ లక్ష్మణ్, డాక్టర్ జానకి రామ్, మహిపాల్,పెంటయ్య,నరేష్, యువకులు ,పెద్ద ఎత్తున గ్రామస్థులు కుటుంబీకులు పాల్గొన్నారు….