నిషేధిత ఈ`సిగర్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ`సిగర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ`సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా పంజాగుట్టలో ఓ వ్యక్తిని తొలుత అరెస్టు చేశాడు. అతను జీడిమెట్లకు చెందినట్లు గుర్తించారు. ఈ`సిగరెట్లను కొందరికి ఇవ్వడానికి వచ్చిన సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఈ`సిగరెట్లను స్టాక్‌ చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు.