నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్…

మండల కేంద్రములో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని గురువారం  జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రకాల పుస్తకాలతో పాటు మౌలిక సదుపాయాలు  కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రవీందర్, సర్పంచ్ లు  ఇంద్ర శేఖర్, విపిన్ ఖోడే,  నాయకులు  సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, మాజీ సర్పంచ్ తెజ్ రావ్ మస్కే తదితరులు పాల్గొన్నారు…