పరిశుభ్రత తోనే పరిరక్షణ

Janam sakshi ఉట్నూర్.
మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఎంపీపీ పంద్ర జైవంత్ రావు డ్రై డే నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతు రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు మరియు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని ఇంటింటికి వెళ్లి డ్రైడే లో భాగంగా ఇంటి చుట్టూ ఆవరణాలోని సింథటిక్ డ్రమ్ములు టైర్లు మొక్కల కుండీలు ఎక్కువ రోజుల నుండి నిల్వ ఉన్న నీరుని పారబోయడం జరిగిందని అదేవిధంగా ప్రతి ఇంట్లో కనీసం ఆరు మొక్కల్ని నాటి జాగ్రత్తగా పెంచాలని చుట్టూ ఆవరణ పరిశుభ్రతంగా ఉంటే మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కలరా లాంటి వ్యాధులనుండి సురక్షితంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంద్రా లత పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్ సి ఎస్ డబ్ల్యూ హెల్పర్ గ్రామస్తులు ఉన్నారు.
Attachments area