పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

నార్నూర్. (జనం సాక్షి)

నార్నూర్ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్ఈఓ పవార్ రవీందర్ అన్నారు శుక్రవారం గాదిగూడ మండలంలోని ఆద్మీయాన్ గ్రామంలో రాపిడ్ ఫీవర్ సర్వేలో భాగంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు గ్రామాల్లో తిరుగుతూ నీటి నిల్వలను శుభ్రం చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో పరిశరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు వాడితోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించాలన్నారు నీటి నిలువలు ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది మలేరియా డెంగ్యీ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి రోగాలు రాకుండ చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది బాపూరావు వాణి రంభ ఉన్నారు
 
Attachments area