పాము కాటుతో వ్యక్తి మృతి

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనంసాక్షి మార్చి 6
 పాము కాటు తో ఓ  వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి  గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి  బి. మొగులయ్య (48) అనే వ్యక్తి మృతి చెందాడు. మధ్యాహ్నం పొలం వద్ద పని చేస్తుండగా పాము  కాటు వేసిందని   కుటుంబీకులకు తెలపడంతో. దీంతో మొగులయ్య ను   వికారాబాద్ మిషన్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబీకులు  తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.