పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డిపెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డి

)

 

 

 

 

పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా అడికిచర్ల సర్పంచ్ జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు మండల నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దేముల్ మండల పరిధిలోని అడికిచెర్ల సర్పంచ్ గా రెండవ సారి కొనసాగుతున్నారు. సర్పంచుల సంఘం అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన జనార్దన్ రెడ్డిని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, మండలంలోని సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్,సీనియర్ నాయకులు రమేష్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ధన్ సింగ్, మండల మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మండల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.