పెద్ద మ్యాచ్‌లతో ప్రతిభ రాణిస్తుంది : రోహిత్‌శర్మ

సిడ్నీ,మార్చి 25 :  పెద్ద మ్యాచ్‌లు ఎప్పుడూ క్రికెటర్ల ప్రతిభను వెలికితీస్తాయని భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ అన్నారు. గురువారం భారత్‌-ఆసీస్‌ల మధ్య ప్రపంచకప్‌ చివరి సెవిూ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడాడు.. ప్రపంచ కప్‌లాంటి మెగా ఈవెంట్లలో భారత్‌ జట్టు ఎప్పుడూ మెరుగ్గా ఆడుతుందన్నారు. 2011లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచినప్పటి నుంచి భారత ఆటగాళ్లు పెద్ద ఈవెంట్లలో మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్నారని తెలిపాడు. ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌ తమకు చాలా ముఖ్యమైనదన్నారు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో తప్పక మెరుగైన ప్రదర్శన ఇస్తామని ధీమా వ్యక్తంచేశాడు. దీనికోసం కోట్లాది అభిమానులు ఎదురు చూస్తున్నట్లుగానే తామూ రాణించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.