పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా

మంబపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్.
తాండూరు జులై 30(జనంసాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని మంబపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం పెద్దేముల్ మండలం మంబపూర్ గ్రామానికి చెందిన పి .రత్నమ్మకు సీఎం సహాయనిధి ద్వార మంజూరు అయిన సిఎంరీలిఫ్ ఫండ్ ఎమ్మెల్యే అదేశాల మేరకు తెరాస మండల మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచ్ శ్రావణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముజిబ్ తో కలసి చెక్ ను అందజేశారు.ఈ సంద‌ర్భంగా మంబపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.