పోడు భూముల సమస్యలపై గ్రామసభలు

:వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపాల్ మరియు చాకల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచులు మరియు మండల తహసిల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోడు భూములపై పట్టాలు ఎవరికి ఇవ్వాలో ఇవ్వొద్దని గ్రామ కమిటీ సభ్యులు నిర్ణయించాలని గ్రామసభలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జడ్పిటిసి రాందాస్ నాయక్ మరియు తహసిల్దార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ…ఎవరైతే ఫారెస్ట్ భూములను 2005 కొద్ది ముందు సాగులో నుంచి ఉన్నారు వారికి పట్టాలు కచ్చితంగా ఇస్తారని ఏదైనా సమస్య ఉంటే పై అధికారులకు తెలియజేసి సమస్యను నివారించుకోవడానికి మార్గదర్శకాలు కూడా ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో చాకల్ పల్లి సర్పంచ్ రాములమ్మ శేఖర్,మందిపాల్ సర్పంచ్ మఠం ప్రమీల చంద్రశేఖర్,ఆర్ ఐ లింగప్ప,పంచాయతీ కార్యదర్శులు విజయలక్ష్మి,స్వరూప మరియు ఆయా గ్రామాల వార్డు సభ్యులు మరియు పోడు భూముల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.