ప్రగతిశీల కార్యకర్త సి. రామ్మోహన్ మృతి

రామ్మోహన్ మరణం పట్ల పలువురు  సంతాపం

హైద‌రాబాద్ జ‌నంసాక్షి

సీనియర్ అధ్యాపకుడు, ఏపీటీఎఫ్, ఇతర ప్రజాసంఘాల ప్రగతిశీల కార్యకర్త సి. రామ్మోహన్ (74) మంగళవారం (మార్చి 8, 2022) ఉదయం వనస్థలిపురం లో మరణించారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అంత్యక్రియలు సాయంత్రం సాహెబ్ నగర్ లో నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్మోహన్ మరణం పట్ల ప్రొఫెసర్ హరగోపాల్, పలువురు విద్యావేత్తలు, సంపాదకులు, ప్రజాసంఘాల కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు.