బండి కొమురయ్యకు పెన్షన్ మంజూరు పట్ల హర్షం

 

 

 

 

 

సైదాపూర్/ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన బండి కొమురయ్య అనే వృద్ధినికి పెన్షన్ గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉండి ఈ నెల 27న మంజూరు అవ్వడం పట్ల ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డిని కి సర్పంచ్ కాయిత రాములు కృతజ్ఞతలు తెలిపారు. గత తొమ్మిది నెలలుగా సాంకేతిక కారణాలతో బండి కొమురయ్య పెన్షన్ డబ్బులు అకౌంట్ లో పడలేదు. ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తోపాటు అధికారులు చేసిన కృషితో నిరుపేద వృద్ధుడైన బండి కొమురయ్యకు ఒకేసారి 9 నెలల కు సంబంధించి 18 వేల రూపాయలు పేన్షన్ డబ్బులు అకౌంట్లో జమ కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పెన్షన్ మంజూరుకు కృషి చేసిన ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తోపాటు అధికారులకు సర్పంచ్ సీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్, సుపరిండెంట్ ప్రేమ్ సాగర్, సీనియర్ అసిస్టెంట్ అనిల్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, టైపిస్ట్ రిజ్వాన్, బిఆర్ఎస్ నాయకులు పోలు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.