బాసరలో బీమా వివాదం

ప్రీమియం చెల్లించకపోవడంపై విసి ఆగ్రహం

బాసర,జూలై30(జనంసాక్షి): బాసర ట్రిపుల్‌ ఐటీ బీమా వివాదంపై ఇన్‌చార్జ్‌ వీసీ వెంకటరమణ సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల నుంచి వసూలు చేసి ప్రీమియం చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఇన్‌చార్జ్‌ వీసీ వెంకటరమణ తెలిపారు. వసూలు చేసిన మొత్తం ట్రిపుల్‌ ఐటీ ఖాతాలోనే ఉన్నాయని.. ప్రీమియం ఎందుకో చెల్లించలేదో విచారణ జరుపుతున్నామని వీసీ వెంకటరమణ చెప్పారు.