బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మతదేహం లభ్యం

నిర్మల్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నది వద్ద గల ఓకటో నంబరు స్నానఘట్టం వద్ద బాసర పోలీసులకు మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (34) మతదేహం లభ్యమైందని, చేతికి రబ్బరు గ్లౌజు ఉండడంతో మేస్త్రీ పనిచేసే వాడిగా.. నిజామాబాదు పట్టణ ప్రాంత వాసిగా భావిస్తున్నామని అన్నారు. ఆచూకీ తేలిసిన వారు బాసర పోలీసు స్టేషన్‌ ఫోన్‌ 9440900639 లో సంప్రదించాలని, మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించామని స్థానిక రక్షక ఎస్‌ఐ రాం ప్రేమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.