బిసి కమిటి హాల్ కు శంకుస్థాపన

 

 

 

 

 

 

 

 

 

 

మోత్కూరు డిసెంబర్ 12 జనంసాక్షి : మండలంలోని పాలడుగు గ్రామంలో ప్రభుత్వ ప్రత్యేక (ఎస్డిఎఫ్) నిధులతో మంజూరైన బీసీ కమ్యూనిటీ హల్ భవనానికి సోమవారం గ్రామ సర్పంచ్ మర్రిపెల్లి యాదయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదయ్య మాట్లాడుతూ తమ గ్రామానికి ప్రభుత్వ స్పెషల్ కోటాలో మంజూరైన అభివృద్ధి నిధులలో రూ.25 లక్షలు సీసీ రోడ్లు,బీసీ భవనం,మట్టిరోడ్లు పనులలో భాగంగా ఇప్పటికే మొదటి దఫాగా సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి ,మిగతా పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎడ్ల భగవంత్, మాజీ ఎంపీటీసీ అంతటి నర్సయ్య,రైతు కోర్డినేటర్ సింగిరెడ్డి నర్సిహ్మ రెడ్డి,బొడిగే వీరయ్య,అంతటి నర్సయ్య,కందికట్ల నరేష్,పబ్బు హనుమయ్య,పబ్బు హరి,ముక్కర్ల బక్కయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.