భక్తి శ్రద్ధలతో ముగిసిన కార్తీక మాసం పూజలు..

: గత నెల రోజులుగా నిత్యం ఉదయం సాయంత్రం స్నాన దాన దీప పూజలతో హరి హరులకు ప్రీతికరమైన కార్తీక మాసం స్థానిక వేణు గోపాల స్వామి దేవాలయంలో జల దీపోత్సవంతో మంగళవారం ముగిశాయి. ప్రతి నిత్యం ప్రధాన అర్చకులు శేశా చార్యులు పరిచారక స్వామి రాజులు చేర్యాల గ్రామ ప్రజలందరి యోగ క్షేమాలు ఆరోగ్యాలు బాగుండాలని సంకల్పంతో భగవత్ బంధువులందరి గోత్ర నామాలు పూజా ది కాలతో నెల రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. నెల అంతా వివిధ పూజలతో కార్తీక పురాణ ప్రవచనాలతో భక్తి పరిమళాలను వ్యాపింప చేశారు. నెలరోజుల పాటు సరోజని, పద్మ, అనురాధ, అండాలు, స్వరూప,రమ సులోచన, లక్ష్మి,ఐలవ్వ, కమల అన్నపూర్ణ తదితరులు పూజలు చేశారు