*భాగ్యనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్*

నిర్మల్ పట్టణంలోని. భాగ్యనగర్ కాలనీలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్.గండ్రత్ ఈశ్వర్  పర్యటించారు.వార్డు అంతటా కాలి నడకన తిరుగుతూ కాలనీవాసులకి పలు సమస్యలను ఆడిగితెలుసుకున్నారు.పారిశుద్ధ్య పనుల దృష్ట్యా రోడ్డు మార్గంలో మరియు మురుగు నీటి కాలువలను దగ్గరుండి శుభ్రం చేయించారు.రానున్న రోజుల్లో మంత్రి వర్యులు .ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  కృషి తో పట్టణ 42 వార్డుల్లో ఉన్న సి.సి రోడ్డు,మురుగు నీటి కాలువలు,కల్వర్టు ,వంటి పలు సమస్యలను శాశ్వతంగా పరిష్కారిస్తాం అన్నారు.ఆయన వెంట ముడారపుగంగాధర్,రవి,ఉబేద్,లక్ష్మణ్,కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.