భారీగా గుట్కా పట్టివేత

రంగారెడ్డి,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి లారీలో హైదరాబాద్‌కు 50 లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను తరలిస్తుండగా.. విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. లారీని సీజ్‌ చేసి.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజిలెన్స్‌ అధికారులు.. రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.