మరో వందరోజుల్లో బ్రహ్మాస్త్ర విడుదల

బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్‌డేట్‌ వచ్చింది. డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్‌ ఉన్న ఆ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ హీరో నాగార్జున, మౌనీ రాయ్‌ సీన్లతో ఉన్న టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ఫిల్మ్‌లో శివుడిగా రణ్‌బీర్‌, ఈషాగా ఆలియా నటిస్తోంది.
అయితే ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రను అమితాబ్‌ పోషిస్తున్నాడు. పురావాస్తుశాఖ నిపుణుడు అజయ్‌ వశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. దమయంతీ పాత్రలో మౌనీ రాయ్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను జూన్‌ 15వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. ఇవాళ ప్రత్యేకమైన రోజు అని, అందుకే టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నామని డైరెక్టర్‌ అయాన్‌ తెలిపారు. మరో వంద రోజుల్లో సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు కూడా వెల్లడిరచారు.