మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి –

మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి – మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మీ శామీర్ పేట్, జనం సాక్షి :మండలంలోని బొమ్మ రాసి పేట్లో ఉన్న అచ్యుత్ అకాడమి, లియో మెరిడిన్ క్లబ్ లో పనిచేస్తున్న మహిళలపై వేదింపులు , భౌతిక దాడులకు పాల్పడుతున్న కె. దామోదర్ రెడ్డి వారి అనుచరులపై పోలిసులు తగు చర్యలు తీసుకోవాలని భారత జా తాయ మహిళ సమాఖ్య మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి జి. లక్ష్మి
డిమాండ్ చేశారు. శుక్రవారం భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శామీర్ పేట్ ఎస్.ఐ రఘు కు దామోదర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు . ఈ కార్యక్రమం లో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మీ తో పాటు జిల్లా మహిళా సమాఖ్యా ఉపాద్య క్షురాలు ఎం. రాజేశ్వరి, కో షాధికారి లత, భాధితులు పాల్గొన్నారు .మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు.
25ఎస్పీటీ -1: పోలీస్ స్టేషన్ లో పిర్యదు చేస్తున్న మహిళలు నాయకులు