మహిళా ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ బాధ్యతలు స్వీకరించిన హేమమాలిని రెడ్డి


ఎపిలో మహిళలకు సిఎం పెద్దపీట: ధర్మాన కృష్ణప్రసాద్‌
గుంటూరు,అగస్టు25(జనంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారని, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్‌ది అని మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు. బుధవారం ఏపి మహిళా ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని రెడ్డి బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జగన్‌ మహిళా పక్షపాతిగా ఉన్నారని తెలిపారు. మద్యంపై ఎన్నికలకు ముందే జగన్‌ చెప్పారని…మద్యాన్ని ముట్టకుంటే షాక్‌ కొట్టేలా చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. టీడీపీ నేతలు పనిలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ సద్వివిమర్శలు చేస్తే మంచిదని మంత్రి ధర్మాన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు మద్దాలి గిరి, ముస్తఫా. పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.