మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం

పరిస్థితి విషమించకముందే మేల్కోవాలి
యువత మత్తుకు బానిసలైతే చేపట్టిన అభివృద్ది శూన్యం
బాధతో తాను సవిూక్ష చేయాల్సి వస్తోంది
గంజాయి సాగు, అక్రమ రవాణాపై సవిూక్షలో కెసిఆర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌20(జనం సాక్షి): రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కేసీఆర్‌ పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగం పై తీవ్ర యుద్దాన్ని ప్రకటించాల్సిన అవసరం వచ్చిందన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని ఆదేశించారు. ఉన్నతస్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయివంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయమన్నారు. ఈ పీడను తొందరగా తొలగించక పోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలని. ఎంతో ఆవేదనతో తాను ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్‌ మెసెజ్‌ల ద్వారా గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. గంజాయిని నిరోధించడానికి డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను, ప్లయింగ్‌ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. బార్డర్లలో చెక్‌ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్‌ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. గతంలో పేకాట నిషేధం అమలయిన తీరుపై రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తిరిగి ఈ రుగ్మత సమాజంలో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోంమంతి మహమూద్‌ అలీ, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, హోం శాఖ సలహాదారు అనురాగ్‌ శర్మ, డిజీపి మహేందర్‌ రెడ్డి, సిఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్‌, శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, భూపాల్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.