ముస్త్యాలలో కొండచిలువ కలకలం

చేర్యాల  మండల పరిధిలోని ముస్త్యాల గ్రామంలోని రహదారిపై మంగళవారం రాత్రి పొడవైన కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు భయంతో కేకలు వేశారు. గమనించిన స్థానికులు కొండ చిలువను కర్రలతో దాడి చేయగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.