మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు

మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన పరిశీలన హుజూర్ నగర్ డిసెంబర్ 2(జనం సాక్షి): హుజూర్ నగర్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని పాఠశాలల్లో సన్న బియ్యం ద్వారా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల్ మీరా, ఉపాధ్యాయునీలు పాల్గొన్నారు.