యుద్దప్రాతిపదికన గులాబ్‌ సహాయక చర్యలు


మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలను చేపట్టాలని ఎపి సిఎం జగన్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సాయాన్ని వెంటనే ఇవ్వాలని, బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సిఎం స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సిఎం జగన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సవిూక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్న సిఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ను అక్కడే ఉండి పరిస్థితిని సవిూక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి ధర్మానకృష్ణదాస్‌ సిఎంకు వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధప్రాతిపదికన
విద్యుత్‌ను పునరుద్ధరించాలని జగన్‌ ఆదేశించారు. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలగిస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు ఫీల్డ్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. చాలచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయి. సముద్రం అలజడిగా ఉంది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దు. సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి’ అని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె కన్నబాబు తెలిపారు. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంట గంటకు 80`90 కిలో విూటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జోరు వర్షాలతో నాగావళి పరవళ్లు తొక్కుతోంది. తోటపల్లి ప్రాజెక్ట్‌ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మడ్డువలస వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. హిర మండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధారలో నీటి ప్రవాహం పెరగడంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. విశాఖ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్‌లో నీరు గరిష్ఠ స్థాయికి చేరింది. అరవై ఒక్క అడుగుల గరిష్ఠ స్థాయిలో నీరు ఉండే ఈ రిజర్వాయర్లో తాజాగా 61 అడుగుల నీరు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ ఎª`లో కూడా ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో డ్యామ్‌ నాలుగు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో ఈ మధ్య ఎప్పుడూ కూడా రిజర్వాయర్లోకి ఈ రకంగా వర్షపు నీరు రాలేదని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో గులాబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తోతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జలమయమయ్యాయి. ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోకవరం మండలం ఇటికాయల పల్లి గ్రామంలో ఇళ్లలోకి నీరు రావడంతో మోటార్లతో నీటిని తోడు కావాల్సిన పరిస్థితి ఏర్పడిరది. రాజమండ్రి నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాతేరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలో కడియం మండలంలో అత్యధిక వర్షపాతం 137.2 మిల్లీవిూటర్లు నమోదయింది. ఏజెన్సీలో కూడా ఏకదాటిగా వర్షం కురుస్తోంది. శాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లోను వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. తుపాను దృష్ట్యా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. 27 మండలాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసి యుద్ధప్రాతిపదికన పరికరాలు,
సిబ్బందిని తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. 276 ప్రైవేటు క్రేన్లు, 64 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. 25,500 విద్యుత్‌ స్థంభాలు, 2,732 ట్రాన్స్‌ఫార్మర్లు స్టోర్‌లో ఉంచారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 86 వేల కుటుంబాలను గుర్తించి తుపాను షెల్టర్లకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసేలా ’స్టేట్‌ ఎమ్జ్గంªన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌’ ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో 1400 మందితో 70 బృందాలు, విజయనగరం జిల్లాలో 700 మందితో 35 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 1440 మందితో 72 బృందాలను రంగంలోకి దించారు. పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను నియమించారు. తుపాను నేపధ్యంలో ఏపీఈపీడీసీఎల్‌ చేపట్టిన ఏర్పాట్లపై డిస్కం సీఎండీ కె.సంతోషరావుతో కలసి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ సవిూక్ష నిర్వహించారు. లైన్‌మెన్‌ నుంచి చైర్మన్‌ వరకూ ఎవరికీ సెలవులు ఉండవని, తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.