యువత తమ ఓటు హక్కును నమోదుచేసుకోవాలి-తహసీల్దార్ పవన్ చంద్ర.

భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచనల మేరకు యువకులు విద్యార్థిని విద్యార్థులు17సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరు18 ఏళ్లు నిండడాని ముందే తమ పేర్లను ఈ నెల3,4 తేదీల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమంలో డిసెంబర్ 8 వరకు తమతమ బూత్ లెవల్ అధికారులకు సంప్రదించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని స్థానిక మండల రెవెన్యూ అధికారి తహశీల్దార్ పవన్ చంద్ర అన్నారు.జాతీయ ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున విలేకరులతో మాట్లాడారు. మండలంలోని అన్ని జిపి గ్రామాల్లో సంబంధిత బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని అందుచేత అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరు గుర్తింపు జాబితాలోకి ఓటర్లను నమోదు చేయడంజరుగుతుందని.తప్పు ఒప్పులు సరి చేసుకొనే మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ పవన చంద్ర తెలిపారు