యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

అగ్నిపథ్ కు నిరసన  వ్యక్తం చేస్తున్న యువకులపై  శుక్రవారం  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో   అమరుడైన  ఖానాపురం మండల దబీర్ పేట గ్రామానికి చెందిన  దామోదర్ రాకేష్ కు బుధరావు పేట యూత్ కాంగ్రెస్ పార్టీఆధ్వర్యంలో శుక్రవారం రాత్రిశాంతియుతగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  ఎల్లా గౌడ్ మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న అగ్నిపధ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  హరీష్  (బన్ను) యాకూబ్ పాషా  భూతం శీను  వినోద్ గొల్లపల్లి శీను లింగన్న కుమార్ రాజు ప్రశాంత్  పాషా మహేష్ మురళి జానీ శంకర్ ఆఫ్రిడ్   తదితరులు పాల్గొన్నారు.