రైతులకు అండగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, బీమా పథకాలను రైతు సంక్షేమం కోసం పెట్టినవేనని అన్నారు. పెట్టుబడితో డిమాండ్‌ ఉన్న పంటలను వేయాలన్నారు. రైతులు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పల్లె ప్రగతి పనులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అప్పుడే సంపూర్ణ అబివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఆడపిల్లల వివాహాల కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద చేస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు